అమరావతి, డిసెంబర్ 16: అమరావతి అసెంబ్లీ నిర్మాణానికి పలు నమూనాలు పరిశీలించిన తరుణంలో టవర్ డిజైన్ కు అందరూ ఓటు వేశారు. ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనంతరం తదుపరి ప్రకటన వెల్లడించనున్నారు. విజయవాడలోని నిన్న ఓ హోటల్లో ఏర్పాటు కార్యక్రమంలో శాసనసభ, హైకోర్టు ఆకృతుల నమూనాలను, పరిపాలన నగర ప్రణాళికను పరిశీలించారు. 1350 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగర ప్రణాళికలను ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేయగా, ఇప్పుడు అందులో స్వల్ప మార్పులు చేశారు. శాసనసభ భవనం డిజైన్ పై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు, సోషల్ మీడియాలో డిజైన్ ఫోటోలను పోస్టు చేయగా, 68 శాతం మంది దీనికి ఇష్టపడ్డట్లు మంత్రి నారాయణ తెలిపారు.