అనంతపురం, డిసెంబర్ 14 : ప్రజాసమస్యల అధ్యయనం కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేడు ఉదయం అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని గంగలకుంట నుంచి ప్రారంభం అయ్యింది. అక్కడి నుండి జనంతో మమేకమవుతూ సాగుతున్న పాదయాత్ర కందుకూరుకు చేరుకు౦ది. కందుకూరులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరి౦చారు. ఆపై హంపాపురం క్రాస్ మీదుగా చిగిచర్ల వరకు చేరుకోగానే నేటి పాదయాత్ర ముగుస్తుంది. ఇప్పటిదాకా ఆయన 457.8 కిలోమీటర్లు నడిచిన విషయం తెలిసిందే. పాదయాత్రలో అడుగడుగునా జగన్ కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు తాము టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్యాయాలను ఆయనకు వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. వారికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ యాత్ర కొనసాగిస్తున్నారు.