అమరావతి, డిసెంబర్ 11 : ఓ వృద్ధురాలు తనకు వృద్ధాప్య పింఛను రావడం లేదని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు క్యాంపు ఆఫీసుకు వచ్చింది. కాని ఆమెను అక్కడి భద్రత సిబ్బంది సీఎంను కలవడానికి అనుమతించలేదు. ఇంతలో ఆ వృద్ధురాలికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ముఖ్యమంత్రి చూస్తారన్న ఉద్దేశ్యంతో క్యాంపు ఆఫీస్ బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ముందు నిలబడి తన ఆవేదనను వ్యక్తం చేసింది. తను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పి, అధికార ప్రతినిధులపై పలు ఫిర్యాదులు చేసి తాపీగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను చేసినదంతా ఆ సీసీ కెమెరాలో రికార్డు అయింది.