ఏలూరు, డిసెంబర్ 09 : జిల్లాలో ఏలూరు గ్రీన్సిటీకి చెందిన కోటా లక్ష్మీనరసింహారావు శ్రీనివాస థియేటర్ సమీపంలో పేకాడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లును పోలీసులు అరెస్టు చేశారు. ఓ భవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడి చేసిన సిబ్బంది ఐదుగురిని పట్టుకొని, వారి నుంచి రూ.28,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరందరూ పౌరోహిత్యం నిర్వహిస్తుంటారని పోలీసులు వెల్లడించారు.