జగన్‌పై నిప్పులు చెరిగిన గిడ్డి ఈశ్వరి..

SMTV Desk 2017-11-29 15:16:07  MLA Giddi Ishwari comments on ys Jagan, SC, ST, ATRACITY CASE.

అమరావతి, నవంబర్ 29 : వైసీపీ అధినేత జగన్ సీఎం కావడం కోసమే పార్టీ పెట్టారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. వైఎస్సార్ పార్టీలో తానూ మూడున్నర ఏళ్ల పాటు కష్టపడ్డానని, ఆ కష్టం జగన్ కు కనిపించలేదా..? అంటూ ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని హత్య చేసే విధంగా ప్రవర్తించినందుకు జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని అన్నారు. గిరిజన మహిళ అయిన తనపై కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గిడ్డి ఈశ్వరి ఇటీవల వైఎస్సార్ పార్టీ నుండి టీడీపీలోకి చేరిన విషయం విదితమే.