విజయవాడ, నవంబర్ 26: కడప ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్ధులు విజయవాడ గుణదలలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో గల సెల్టవర్ ఎక్కారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని, లేదంటే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని కిందకు దిగమని కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపు ఉదయం 9గంటలకు అసెంబ్లీ దగ్గర తనను కలవాలని తెలిపారు. కొన్ని రోజులుగా ఫాతిమా మెడికల్ కళాశాలకు సంబంధించి వంద మంది వైద్య విద్యార్థులు న్యాయం కోసం పోరాడుతూ ఆందోళన నిర్వహిస్తున్నారు.