అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించిన జగన్‌...

SMTV Desk 2017-11-26 10:35:54  jagan, prajasankalpayatra, ambedkar, tribute

కర్నూల్, నవంబర్ 26: వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 18వ రోజు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి ఆదివారం ప్రారంభమైంది. రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా దాదా సాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ సేవలు గుర్తు చేస్తూ, అధికారంలోకి వస్తే మసీదుల నిర్వహణకు రూ. 15 వేలు, ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజమ్‌లకు రూ. 5 వేల వేతనం ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. రామకృష్ణాపురంలో ముస్లిం మత పెద్దలు వైఎస్‌ జగన్‌ను కలిశారు. జగన్‌ హామీపై ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.