మంగళగిరి, నవంబర్ 25: తెలుగు తమ్ముళ్లకు శుభవార్త. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 5.17 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిని ఆనుకుని కార్యాలయాన్ని నిర్మించనున్నారు. మొత్తం మూడు బ్లాక్లుగా నూతన పార్టీ కార్యాలయం నిర్మాణం జరగనుంది. కార్యాలయం నిర్మాణం కోసం 3.60 ఎకరాల స్థలం లీజుకు తీసుకున్న టీడీపీ.. 2018 డిసెంబర్ నాటికి కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో మంగళగిరి వద్ద ఈ రోజు నుంచే కార్యకర్తల కోలాహలం కనిపిస్తుంది.