దొంగల బీభత్స౦.. వృద్ధురాలు మృతి..

SMTV Desk 2017-11-19 13:12:59  theft case, murdur, prakasam,

ప్రకాశం, నవంబర్ 19: జిల్లాలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా, కందుకూరులోని గుర్రంవారి పాలెంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలిపై దుండగులు చోరికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ధరించిన నగలను దోచుకెళ్లి, తీవ్రంగా గాయపరిచారు. దీంతో లక్ష్మమ్మ అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఆ దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు.