గుంటూరు, నవంబర్ 07 : రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి తానూ సిద్దమే అంటున్న ప్రముఖ సినీ నటి వాణీ విశ్వనాథ్ ఏ పార్టీలో చేరతారో అనే సందిగ్ధతకు తెర పడింది. ఎట్టకేలకు తాను తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “తెలుగు వారి ఆదరాభిమానాల కారణంగానే నేను ఈరోజు ఇలా ఉన్నాను. అలాంటి వారి కోసం చాలా కాలం నుండి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. చంద్రబాబు నాయకత్వం అంటే చాలా ఇష్టం” అంటూ తెలిపారు. గుంటూరు నగరంలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శన శాలను సందర్శించిన ఆమె.. నేటి సమాజంలో ప్రతి పౌరుడు చేనేత వస్త్రాలను వినియోగించి చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.