వైద్యం వికటించి తల్లి బిడ్డా మృతి..

SMTV Desk 2017-11-03 14:22:01  Rajamahendravaram hospital, women died, management Neglected, Gynic deportment.

తూర్పుగోదావరి, నవంబర్ 03 : వైద్యం వికటించి తల్లి బిడ్డా వృతి చెందారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మాతా శిశు విభాగం (గైనిక్) వార్డులో దేవిపట్నం మండలం, రామన్న గూడెంకు చెందిన ఓ మహిళ డెలివరీ నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆసుపత్రి వైద్యులు చేసిన వైద్యం వికటించగా ఆ మహిళతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా మృతి చెందింది. ఈ నిర్లక్ష్యానికి వైద్యులే కారణమంటూ ఆ మహిళ బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బైటాయించారు.