నెల్లూరు, అక్టోబర్ 13: ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరువు నెలకుంటే వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావించిన నేతలకు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు చెంప్ప పెట్టని, రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. భారీ వర్షాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు, వెరసి రాష్ట్రం జల సిరితో కలకలలాడుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని వడిసి పట్టేందుకు రూ. కోట్ల ఖర్చుతో సీఎం చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమంతో, పంటకుంటలు చెక్ డ్యాంలు నీటితో నిండాయని అన్నారు. అదే సమయంలో భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. రాష్ట్రం అమలు చేస్తున్న రుణమాఫీ మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయంగా నిలిచిందని చెప్పారు.