అన౦తపురంలో పర్యటించిన మంత్రి సునీత..

SMTV Desk 2017-10-09 15:25:09   Minister paritala Sunita, Visited Anantapur districts, heavy rains.

అనంతపురం, అక్టోబర్ 9 : భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రి పరిటాల సునీత అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో నడిమివంక, పండమేరు వాగు, సీఎన్‌పురం, సుందరయ్య కాలనీ.. జాకీర్ కొట్టాల, బీఎన్‌ఆర్‌ కాలనీ, దండోర కాలనీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన నష్టాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని, చింతించాల్సిన అవసరం లేదని తెలిపారు. బాధితులకు బియ్యం, కిరోసిన్ అందజేస్తామన్నారు. ఇంకా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.