కదిరి, అక్టోబర్ 8 : అనంతపురం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.... అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం సంజీవ పల్లి బస్ స్టేజ్ వద్ద ఆదివారం మదనపల్లి వెళ్లి వస్తున్న ఒక పేపర్ వ్యాన్ ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా పేపర్ వ్యాన్ మీద పడటంతో అది నుజ్జునుజ్జుయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, లారీ డ్రైవర్ చెయ్యి, క్లీనర్ కాలు విరిగాయి. ఆ వ్యాను లో డ్రైవర్ తో పాటు ముగ్గురు జామకాయల వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు. గాయపడ్డ వారిని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.