అమరావతి, అక్టోబర్ 7 : పవన్ కళ్యాణ్ గురించి తెదేపా కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. శుక్రవారం జనసేన అధినేత పవన్.. తన ట్విట్టర్ ఖాతాలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ లకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలీదు. సంతోషం... అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం.. ఆ మంత్రులు పవన్ పై చేసిన వ్యాఖ్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలందరూ ఆచి తూచి మాట్లాడాలని, మరీ ముఖ్యంగా ఇలాంటి సున్నితమైన విషయాల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు. అంతేకాకుండా అధిష్టానం నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఇరుకులో పడకూడదని ఆదేశించారు.