లోకేష్ మగాడు... మీ వాడు మగాడో కాదో నువ్వే తేల్చుకో..

SMTV Desk 2019-10-24 15:48:14  

వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల పై గట్టిగానే స్పందించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. మాములు కూడా కాదు చాల దారుణంగా వ్యాఖ్యానించారు. లోకేష్ ని మగాడు అంటూ, వైసీపీ నేతల పై విరుచుకు పడ్డాడు బుద్ధా వెంకన్న. గతం లో జరిగిన వాటన్నిటికీ వైసీపీ తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. ప్రతిపక్ష నేతగా జగన్ తిన్న తిండి లోకేష్ కి అంటగడతారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు బుద్ధా వెంకన్న. లోకేష్ మగాడిలా మీ దొంగ పత్రిక రాసిన వార్తలో ఉన్న తేదీల్లో ఎక్కడ ఉన్నాడో ఆధారాలతో సహా బయట పెట్టాడు. మీ వాడు మగాడో కాదో నువ్వే తేల్చుకో అంటూ విజయసాయి రెడ్డి కి పరోక్షంగానే చురకలు అంటించారు.

ప్రజాధనాన్ని పందికొక్కులా తిని, తిన్నది అరగక చిప్పకూడు తిన్న నువ్వు, మీ తుగ్లక్ ముఖ్యమంత్రా లోకేష్ గురించి మాట్లాడేది అని అన్నారు. నీది మనిషి పుట్టుక అయితే ఆధారాలు చూపించు అంటూ అన్నారు బుద్ధా వెంకన్న. లోకేష్ ఆధారాలతో నిరూపించారు సరే, మరి వైసీపీ నేతలు కూడా ఆధారాలు చూపిస్తారా? లేదంటే సైలెంట్ గా ఉండిపోతారా? ఇప్పటికే చాల ప్రశ్నలపైనా నోరు మెదపని ప్రభుత్వం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది.