వనస్థలిపురం చోరీ.. రాంజీ ముఠా పనే అట

SMTV Desk 2019-05-09 13:49:19  ATm, vanasthali puram

వనస్థలిపురంలో ఏటీఎం డబ్బుల దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు.. పురోగతి సాధించారు. చోరీకి పాల్పడింది చెన్నైకి చెందిన రాంజీ గ్యాంగ్ గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఉన్న చెక్ పోస్టులు, టోల్ గేట్ల వద్ద నిఘా కట్టుదిట్టం చేశారు. దృష్టి మరల్చి చోరీలు చేయడంలో రాంజీ గ్యాంగ్ పేరుపొందింది. దోపిడీ తర్వాత దొంగలు రోడ్డు మార్గంలో చెన్నైకి వెళ్లినట్లు సమాచారం. దాదాపు 20 బృందాలుగా ఏర్పడి పోలీసులు.. దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. గతంలోనూ ఆరు సార్లు హైదరాబాద్ లో రాంజీ గ్యాంగ్ భారీ దోపీడీలకు పాల్పడినట్లు సమాచారం.