లంచం తీసుకోంగా ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

SMTV Desk 2019-05-07 16:23:11  Lancham, ACB, VRO

లంచం లంచం లంచం.. ఏది కావాలన్న లంచమే .. లంచం తీసుకోంగా ఓ గవర్నమెంట్ అధికారి చిక్కులో పడ్డాడు.. వివరాల్లోకి వెళితే పట్టాదారు పాసుపుస్తకం మంజూరు కోసం ఓ రైతు వద్ద నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ గార మండలం వాడాడ గ్రామ విఆర్ఓ కింజరాపు గిరి ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. గత కొద్ది రోజులుగా పట్టాదారు పాసుపుస్తకాలు కావాలంటూ రైతు, VRO గిరి చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ విసుగుచెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలోని చినబొందిలీపురం సాయి కీర్తన హోమ్స్ లో నివాసముంటున్న వీఆర్వో గిరికి ఆ రైతు 20 వేల రూపాయలు లంచం యిస్తుండగా, ఏసిబి అధికారులు గిరిని రెడ్డ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.