కృష్ణా జిల్లాలో ఏసీబీ అధికారిణికి వరకట్న వేధింపులు

SMTV Desk 2019-05-06 11:56:21  Dowry Harrasment

రోజు రోజుకి భార్యలపై వరకట్న వేధింపుల కేసులు ఎక్కువైపోతున్నాయి.. తాజాగా ... కృష్ణా జిల్లాలో ఓ ఏసీబీ అధికారిణి తనను భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారిణి పిడిక్కాల ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రభావతి గత నవంబర్‌లో శంకరశెట్టి కిరణ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్న భర్త... ఆ తర్వాత నుంచి రూ.20 లక్షల కట్నం తేవాలంటూ వేధింపులకు దిగాడు. అవి కాస్త శ్రుతి మించడంతో ఆమె స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.