నిన్న హరి ప్రియ.. నేడు రేగా కాంతారావు

SMTV Desk 2019-05-05 17:32:56  Hari Priya, rega Kantha rao

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజానీకం నుంచి వరుస షాక్‌ లు ఎదుర్కొంటున్నారు. పరిషత్‌ ఎన్నికల ప్రచారంలో వీరికి తీవ్ర నిరసన వ్యక్తమౌతుంది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై తాజాగా కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లదాడికి యత్నించారు.

అదేవిధంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుపై ఈరోజు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి కాంతారావు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. అయితే అక్కడ కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరుతుండగా... అది గమనించిన ప్రజలు ఆయణ్ను నిలదీశారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయమని చెప్పి.. ఇప్పుడు ఆ గుర్తుకు ఓటు వేయకుండా కారు గుర్తుకు వేయాలని ఎలా చెప్తున్నారని ప్రజలు సూటిగా ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులకు, గ్రామస్థులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంతో కాంతారావు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.