డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్‌

SMTV Desk 2019-05-03 18:11:35  arrest,

అంతర్ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠాను ఈ రోజు సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబయి నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్‌ తీసుకువస్తుండగా.. ఐదుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లుగా సైబరాబాద్‌ సీపీ అంజని కుమార్ చెప్పారు . నిందితుల నుంచి 28గ్రాముల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గతంలో డీజే గాను, పబ్ లలో పనిచేసిన వ్యక్తులు గత ఏడాది కాలంగా డ్రగ్స్ అమ్మకాలలో ప్రముఖుడైన ఉస్మాద్, సమద్ లతో పరిచయాలు పెంచుకుని డ్రగ్స్ వ్యాపారాన్ని విస్తరించారని అంజనీ కుమార్ చెప్పారు.