జననాంగాలు లేకుండా .. ఒంటికాలుతో శిశువు పుట్టుక.. షాక్ లో డాక్టర్స్

SMTV Desk 2019-05-03 18:04:15  sangareddy,

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వాసుపత్రిలోనిన్నఅనగా గురువారం ఉదయం ఒక మహిళ ఒంటికాలితో ఉన్న శిశువుకు జన్మనివ్వడంతో వైద్యులు సైతం ఆశ్చర్యానికి గురి అయ్యారు . ఇక తల్లితండ్రుల బాధ, ఆవేదన చెప్పక్కరలేదు. జిల్లాలోని వట్ పల్లి మండలంలోని పోతులబొగుడ గ్రామానికి చెందిన సుజాత అనే మహిళకు నొప్పులు రావడంతో ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా వైద్యులు వెంటనే సిజేరియన్ ఆపరేషన్ చేసి ఒంటికాలు శిశువును బయటకు తీశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ శిశువుకు జననాంగాలు కూడా లేవు. ఉన్న ఒక్క పాదం కూడా వంకర తిరిగి ఉంది. బరువు కూడా చాలా తక్కువగానే ఉంది. సిరినోమిలియా అనే జన్యులోపం కారణంగా ఇలాంటి శిశువులు జన్మిస్తారని వైద్యులు చెప్పారు. ప్రస్తుతానికి ఆ శిశువు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఎక్కువ కాలం బ్రతకడం కష్టమని వైద్యులు చెప్పారు. పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్న ఆ శిశువు ఇటువంటి శారీరక అవకరంతో పుట్టడం చాలా బాధాకరమే.