ఈ రోజు నుండి ఎంసెట్ షురూ

SMTV Desk 2019-05-03 10:17:35  eamcet,

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు ఎంసెట్-2019 ఆన్‌లైన్‌ పరీక్షలు శుక్రవారం నుంచి మొదలవబోతున్నాయి. మే 3,4,6 తేదీలలో ఇంజనీరింగ్, మే 8,9 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్దులు అందరూ గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈసారి ఇంజనీరింగ్ విభాగంలో 1,42,218 మంది అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో 74,981 మంది హాజరవుతున్నారని తెలిపారు. 235 మంది రెండు పరీక్షలు వ్రాయబోతున్నారని తెలిపారు. ఎంసెట్ పరీక్షల కోసం తెలంగాణలో 83, ఆంధ్రాలో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.