టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సీబీఐ నోటీసులు

SMTV Desk 2019-04-26 16:45:17  Suajana Choudary, CBI notices

టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సీబీఐ నోటీసులు పంపింది. రేపు బెంగళూరు సీబీఐ కార్యాలయంలో ఆయన హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీ వ్యవహారంలో సుజనా చౌదరికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఈ నోటీసుల వ్యవహారంపై సుజనా చౌదరి స్పందించారు. 2003 నుంచి తాను మూడు కంపెనీల్లో మాత్రమే నాన్ ఎగ్జిక్యూటివ్ పదవుల్లో ఉన్నానని అది కూడా 2014 అక్టోబర్ వరకు మాత్రమే ఉన్నానని అన్నారు. ఆ తర్వాత నుంచి తాను ఏ కంపెనీల్లో, ఏ పదవుల్లో లేనని తెలిపారు. సీబీఐ పంపిన సమన్లు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించినవని ఆయన అన్నారు. ఆ కంపెనీతో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని దీనిపైన చట్టపరంగా చర్యలకు సిద్ధమవుతున్నానని ఆయన అన్నారు.