హిందూపురం ఎమ్మెల్యే టాలీవుడ్ సినీ నటుడు బాలకృష్ణ కూడా పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పర్యటించారు. అయితే ఆయన తన అభిమానులు, కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తన అభిమానులపై బాలయ్య నోరుపారేసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ఇది బయటపడింది కూడా. అయితే తాజాగా బాలయ్య వ్యవహారంపై అతని భార్య వసుంధరా దేవి స్పందించారు.
వివరాల్లోకి వెళితే, తన అభిమానులతో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నారు వసుంధర. అయితే కొన్నిసార్లు ఫ్యాన్స్ తప్పుగా ప్రవర్తించినా, తప్పులు చేసినా ఆయనకు కోపం వస్తుందన్నారామె. అభిమానులతో ఉన్న చనువతోనే, మనవాళ్లు అన్న అభిమానంతోనే బాలయ్య అలా ఉంటారన్నారు. బాలకృష్ణ ఏమన్న ఆయన ఫ్యాన్స్కూడా ఏమీ అనుకోరన్నారు వసుంధర. ఆయనంటే పడనివాళ్లు మాత్రమే దీన్ని వేరేరకంగా హైలైట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.