కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్తత

SMTV Desk 2019-04-04 16:33:01  mylawaram

మైలవరం: కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సభకు బందోబస్తుగా వచ్చిన పోలీసులపై వైసీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి