వైసీపీలో చేరనున్న జీవిత రాజశేఖర్

SMTV Desk 2019-04-01 11:44:17  jeevitha, rajasekhar

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రాజశేఖరరెడ్డిని జీవిత, రాజశేఖర్ దంపతులు కలిశారు. ఈ ఉదయం లోటస్ పాండ్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. త్వరలో ఈ దంపతులు వైసీపీలో చేరే అవకాశం ఉంది. అయితే ఎలాంటి చర్చలు నడిచాయి అనే విషయం బయటకు రాలేదు.

పార్టీలో చేరడం, ఆపై ఎన్నికల్లో ప్రచారం, తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. వైసీపీ తరఫున వీరిద్దరూ ఏపీలో పర్యటించి, ఆ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేయనున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.