వైసీపీ అభ్యర్ధి అనూహ్య ప్రవర్తన.

SMTV Desk 2019-03-30 18:36:26  ycp, yscrp,

ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు ఎన్నో పాట్లు పడుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు తెలిసినవాడు వచ్చినా పట్టించుకోని వారు ప్రచారంలో మాత్రం తమకు తెలియని వాడినైనా సరే నవ్వుతూ పలకరించి ఆలింగనం చేసుకుంటుంటారు. అయితే నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌ మాత్రం ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ తరపున తిరుపతి నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే ఈసారి సిట్టింగ్ స్థానాన్ని ఇవ్వని పార్టీ అధిష్ఠానం ఆయనకు గూడూరు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చింది.

దీంతో ప్రచారంలో భాగంగా ఈ నెల 27న ఉదయం 7 గంటల సమయంలో గూడూరు పట్టణం దొమ్మలపాళ్యం వద్ద హల్‌చల్‌ చేశారు. ఆయన మాటల ధాటికి తట్టుకోలేక స్థానికులు ఆయనకు దూరంగా పరుగులు తీశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వరప్రసాద్‌ వ్యవహారశైలిపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్ట్ ఐఏఎస్ అయిన ఆయన చాలా హుందాతనం కలిగిన వ్యక్తి అని ఇలా ఎందుకు ప్రవర్తించారో అని అనుకుంటున్నారు. మద్యం మత్తులో ప్రచారం చేస్తున్నారని అధికార టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కుపెట్టింది.