రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సమాధానమిచ్చారు.
మన సైకిల్ చైన్ కేసీఆర్ లాగేశాడని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. కేసీఆర్కు ఆ శక్తి ఉందా? మన సైకిల్ జోరు పెంచితే.. బుల్లెట్గా మారి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్కు తెలియదు సైకిల్ సత్తా. ఒకప్పుడు ఈ సైకిల్ ఎక్కినవాడే ఆ కేసీఆర్ కూడా. ఈ సైకిల్ లేకపోతే ఆయన లేడు.
అలాంటి వాడు మన చైన్ను లాగుతాడా? అంత ధైర్యమా? అంత ఇస్తామా మనం? ఈ సైకిల్ ఎప్పటికప్పుడు బుల్లెట్లా మారి దూసుకెళుతుంది. అడ్డం వచ్చిన వాళ్లను తొక్కుకుని పోతుంది తప్ప వెనుదిరిగే సమస్యే లేదు. ఇది పేదవాడి సైకిల్ అంటూ చంద్రబాబు ఆవేశంగా చెప్పారు.