ఎన్నికల ప్రచారంలో విశ్రాంతి లేకుండా పాల్గొంటున్న నేతలు ఒక్కోసారి తమకు తెలీకుండానే నోరు జారేస్తున్నారు. ఒక విషయం గురించి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడేస్తూ నాలుక కరుచుకుంటున్నారు. ప్రత్యర్థులు ఈ పొరపాట్లను వేలెత్తి చూపిస్తూ నానా హంగామా చేస్తున్నారు. తాజాగా ఈ పరిస్తితి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలెత్తింది.
ఓ ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన సిఎం ప్రసంగం రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి మనం 25 అసెంబ్లీ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించాలి, నూతన అధ్యాయాన్ని రాయాలి అన్నారు. ఆ మాటలు విన్న జనంతో పాటు పార్టీ నేతలు సైతం 25 అసెంబ్లీ సీట్లేమిటి, చరిత్ర సృష్టించడం ఏమిటని ఖంగుతిన్నారు. నిజానికి సిఎం 25 ఎంపీ స్థానాలు లేదా 125 అసెంబ్లీ స్థానాలు అనబోయి పొరపాటున 25 అసెంబ్లీ సీట్లు అని ఉండవచ్చు.
ఇక ప్రతిపక్ష మీడియా అయితే ఆ ప్రసంగం తాలూకు క్లిప్పింగులను పెట్టి మరీ వార్తలు రాస్తూ నానా హడావుడి చేస్తోంది. వారి కార్యకర్తలైతే సోషల్ మీడియాలో ట్రొలింగ్స్ మీద ట్రొలింగ్స్ చేస్తున్నారు. కాబట్టి నేతలు ప్రసంగాలు ఇచ్చే సమయంలో కాస్త అప్రమత్తతో ఉండటం మంచిది.