కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆసుపత్రిపై ఐటీ రైడ్స్

SMTV Desk 2019-03-27 10:26:09  kanigiri,

సార్వత్రిక ఎన్నికల సమయంలో అభ్యర్థులపై ఐటీ రైడ్స్ షాక్ గురి చేసే అంశం. ముఖ్యంగా ఏపీలో పార్టీలు నేతలు తీవ్ర స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఆయా నేతలపై కార్యాలయాలపై ఐటీ సోదాలు చేయడం టెంక్షన్ పెట్టడం వంటిదే.

కాగా ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి సంబంధించిన గుంటూరులోని అమరావతి ఆస్పత్రిపై ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఇంకా ఆయా ఆసుపత్రికి చెందిన ఇతర కార్యాలయాలపై కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని ఉగ్ర నరసింహారెడ్డి షాక్ కు గురైనట్లు సమాచారం అందుతుంది.