ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో

SMTV Desk 2019-03-23 13:48:24  congress, Ap.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలో వివిధ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఆ వెంటనే నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో తన మేనిఫెస్టోను ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఆయన విడుదల చేశారు. కార్పొరేట్‌ స్కూళ్లు, ఆస్పత్రుల దోపిడీ నియంత్రణ పనులు చేపడతామని అన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సమర్థంగా అమలు చేస్తామన్నారు. చేనేత కార్మికులకు అప్పులు పూర్తిగా మాఫీ చేస్తామని అన్నారు. వారికి జీఎస్టీ నుంచి మినహయింపు ఇస్తామని తెలిపారు.


మేనిఫెస్టో అంశాలు ఇవే..



వికలాంగులకు రూ.3వేలు పింఛను
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మాదిరిగా బీసీలు, మైనారిటీలకు చట్టబద్ధత కూడిన సబ్‌ప్లాన్‌
ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఉచిత సరఫరా


రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
సంక్షేమ పథకాలకు బయోమెట్రిక్‌ విధానం తొలగింపు
రజకులు, వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి
ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టం
60-70 ఏళ్ల వారికి రూ.2,500, 70 ఏళ్లు దాటిన వారికి రూ.3వేలు ఫింఛను
వాల్మీకులు, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి
రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బులు చేరుస్తాం
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి
స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతు ధర
విద్యా హక్కు చట్టం పటిష్ఠ అమలు
కార్పొరేట్‌ స్కూళ్లు, ఆస్పత్రుల దోపిడీ నియంత్రణ
పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ధరల నియంత్రణ
50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి రూ.2వేలు ఫింఛను
ఒంటరి మహిళలకు పెన్షన్‌