దేవినేని అవినాష్ కు భారీగా జనం

SMTV Desk 2019-03-22 13:57:30  దేవినేని అవినాష్ కు భారీగా జనం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోస్ట్ ప్రెస్టీజియస్ నియోజకవర్గం గుడివాడ, ఇక్కడ అధికార టీడీపీ, వైసీపీల మధ్య గట్టి పోరు నడుస్తోంది. వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీ చేస్తుండగా, టీడీపీ తరఫున దేవినేని అవినాష్ తలపడుతున్నాడు. ఈ ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నడుస్తున్నందున ఏపీలో అందరి చూపు గుడివాడ వైపే ఉంది, ఈ క్రమంలో దేవినేని అవినాష్ నామినేషన్ వేయగా ర్యాలీకి భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఈ నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపిస్తుందంటూ టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.