దేవాన్ష్ కూడా ఆ పాలే తాగుతాడు

SMTV Desk 2017-06-02 11:11:13  heritage milk,chennai, nara brhamani, ed heritage

చెన్నై, జూన్ 2 : వినియోగదారులకు స్వచ్ఛత తో పాటు నాణ్యమైన పాలను అందిస్తున్న హెరిటేజ్ సంస్థ రజతోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నదని హెరిటేజ్ పుడ్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి వెల్లడించారు. హెరిటేజ్ సంస్థ ద్వారా తయారుచేసిన పెట్ బాటిల్ పానీయాలను ఆమె గురువారం చెన్నై లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. హెరిటేజ్ సంస్థ పాల సేకరణకు స్టెయిన్ లెస్ క్యాన్ లు వాడుతున్నామని ...ఇతర సంస్థల మాదిరిగా నిల్వ చేసేందుకు ఎలాంటి కృత్రిమ చర్యలను చేపట్టకుండా స్వచ్ఛంగా వినియోగదారులకు అందిస్తున్నామని వివరించారు. ప్రైవేటు సంస్థలు పాలను కల్తీ చేస్తున్నాయని, ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు రసాయనాలను వాడుతున్నారనే తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ ఆరోపణలకు స్పందిస్తు తమ సంస్థ పాల స్వచ్ఛతకు తిరుగులేదని చెప్పారు. హెరిటేజ్ పాలలో కల్తీకి తావులేదని, ఎలాంటి సర్దుబాటు, రాజీ కి ఆస్కారం లేకుండా నాణ్యతకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె ప్రకటించారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తమ కుమారుడు దేవన్ష్ సహా తమ కుటుంబ సభ్యులంతా హెరిటేజ్ పాలనే సేవిస్తారని వెల్లడించారు. తమ సంస్థ ద్వారా పాల ఉత్పత్తి దారులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతున్నదని, రైతులకు 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం సంస్థ ద్వారా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.