జగన్ వాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారారు

SMTV Desk 2019-03-22 11:54:36  jagan, divya vani

సినీనటి దివ్యవాణి టీడీపీ అధికార ప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీ వైఎస్పార్‌సీపీపై, దాని నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్, ఎమ్మెల్యే రోజాను ఆమె ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ కొన్నాళ్లుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె జగన్, రోజాలను పరోక్షంగా రావణాసురుడు, శూర్పణఖలతో పోల్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..

‘చంద్రబాబు కష్టాన్ని అర్థం చేసుకోలేని వాళ్లు, అభివృద్ధి పథకాలపై బురదజల్లే కార్యక్రమానికి ఓ రావణాసురుడు, శూర్పణఖ పాల్పడుతున్నారు. తన కుటుంబంలోని సొంత బాబాయ్ ప్రాణాలనే కాపాడుకోలేని వ్యక్తి, ఐదు కోట్ల ప్రజలను ఆయన కాపాడతాడనేది నమ్మశక్యంగా లేదు. జగన్‌కు ఓటేస్తే పరోక్షంగా మోదీకి, కేసీఆర్‌కు వెళ్లిపోతాయి. మన రాష్ట్ర అభివృద్ధికి వాళ్లిద్దరూ పెద్ద అడ్డంకులుగా ఉన్నారు. జగన్ వాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారారు. లోకేశ్ బాబుకు సరిగ్గా తెలుగు రానంత మాత్రాన అవమానించడం సరికాడు. ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం చాలా పనిచేస్తున్నారు’ అని పరోక్ష వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి.