శ్రీ వై.ఎస్.వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి కలగాలి: జనసేన

SMTV Desk 2019-03-16 19:22:45  janasena,

విజయవాడ, మార్చ్ 16: దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు,అలాగే ప్రతి పక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వై ఎస్ వివేకానంద రెడ్డి నిన్న అనుమానాస్పదంగా హత్యకు గురైన ఘటన మొత్తం వై ఎస్ అభిమానులతో పాటు వై ఎస్ కుటుంబాన్ని కలచి వేసింది.ఈ రోజే ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి,దీనికి జగన్ కూడా హాజరయ్యి తన సంతాపాన్ని బాధని వ్యక్తపరిచారు.ఇప్పటికే ఈ హత్య విషయంలో అసలు నిజం ఏమిటి అన్నది బయటకు రాలేదు కానీ అప్పుడే దీన్ని కొంతమంది రాజకీయం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ సందర్భంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వై ఎస్ ఇంట జరిగిన ఈ విషాదానికి తన స్పందన తెలియజేసారు.”మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి గారు హత్యకు గురి కావడం దిగ్బ్రాంతి కలిగించింది.ఆయన సతీమణి సౌభగ్యమ్మ గారికి,కుమార్తె సునీత గారికి నా తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను,వివేకానందరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.”అని జనసేన పార్టీ తరపు నుంచి ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసారు.