అమరావతి, మార్చ్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లోక్సభ ఎన్నికలకు ఎంపికైన టిడిపి అభ్యర్థులను నేడు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 49 అసెంబ్లీ స్థానాలను కూడా పర్యావేక్షించి అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. అయితే ఇప్పటికే చంద్రబాబు లోక్సభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థులను నియమించినట్టు.. ప్రకటించడం ఒక్కటే ఆలస్యంగా ఉన్నట్టు కన్పిస్తోంది.