అమరావతి, మార్చ్ 14: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు జనసేనలో ముఖ్యనేతగా కొనసాగుతున్నటువంటి జనసేన నేత సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన సభ్యత్వానికి పార్టీ జిల్లా కొకన్వీనర్, పార్లమెంట్ మెంబర్ యర్రా నవీన్ రాజీనామా చేయనున్నట్లు తాజా సమాచారం.జనసేన అధినేత పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించారని మనస్తాపంతో రాజీనామా చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో జరుగనున్న విలేకరుల సమావేశంలో నవీన్ పూర్తివివరాలు వెల్లడించి తన కార్యాచరణ ప్రకటించనున్నారు.