చిత్తూరుపై దృష్టి పెట్టిన సీఎం

SMTV Desk 2019-03-13 15:24:43  Chandrababu, Ap Cm,

హైదరాబాద్, మార్చ్ 13: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఆయన సొంత జిల్లా చిత్తూరుపై దృష్టి పెట్టారు. ఈరోజు 30 పెండింగ్ స్థానాల నేతలతో భేటీ కానున్నారు. ఆ స్థానాల్లో సత్యవేడు, శ్రీకాళహస్తి, మదనపల్లి, తంబాలపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి.

ఆశావహుల జాబితాతో పాటు సర్వే సమీకరణాలను ముందు పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి ఆదిత్య పనితీరుపై పార్టీలో కొంత అసంతృప్తి ఉండటంతో జేడీ రాజశేఖర్ లాంటి పలువురి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. దీంతో యనమల, సుజనా కమిటీ రంగంలోకి దిగి పార్టీ నేతల అభిప్రాయాన్ని తెలుసుకొనున్నారు.

ఇక మదనపల్లె, తంబాలపల్లెలో ఒక స్థానాన్ని బీసీకి కేటాయించాలనే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీకాళహస్తి స్థానాన్ని ఎస్వీసి నాయుడు, బొజ్జల సుధీర్ ఆశిస్తుండగా ఈ నెల 16 నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే కైకలూరు, తిరువూరు, నూజివీడు స్థానాలపై కూడా సమగ్ర చర్చలు జరగనున్నాయి.