లోకేష్ స్తానం ఖరారు

SMTV Desk 2019-03-12 16:27:13  Nara Lokesh,

ఏపీలో ఎన్నికల సమయ దగ్గరపడుతుండడంతో అక్కడ రాజకీయ వాతావరణం అంత కూడా వేడెక్కుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా దాదాపుగా ఖరారైపోయారు. టీడీపీ నుండి కొన్నిం అభ్యర్థుల పేర్లు కూడా బయటకొచ్చాయి. అయితే, ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై గత కొన్ని రోజులుగా పెద్ద చర్చే జరుగుతుంది. తాజాగా చంద్రబాబు ఆ విషయానికి తెర తీశారు. విశాఖ ఉత్తరం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారని టీడీపీ స్పష్టం చేసింది. ముందుగా విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేపించాలి అనుకున్నారు కానీ చివరగా విశాఖ ఉత్తరానికి ఆయన బరిలోకి దిగనున్నారు. కాగా ఇప్పటికి కూడా భీమిలి స్థానం పెండింగ్ లోనే ఉంది. అయితే భీమిలి నుండి మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మినారాయణ టీడీపీ తరపున పోటీ చేస్తారనే బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి…