పినపాకలో కాంగ్రెస్‌ నేతల సమావేశం

SMTV Desk 2019-03-05 16:54:21  congress,

పినపాక, ఆసిఫాబాద్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు తెరాసలో చేరబోతున్నట్లు చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారి ఫిరాయింపు వలన ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కించుకోలేని దుస్థితి ఏర్పడటంతో కాంగ్రెస్‌ నేతలు ఫిరాయింపులను నిరసిస్తూ నేడు ఆసిఫాబాద్, పినపాక నియోజకవర్గాలలో ధర్నాలు చేసి వారిని ఎన్నుకొన్న ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్క, హరిప్రియ, పొదెం వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు తదితరులు మంగళవారం మణుగూరు చేరుకొని ముందుగా స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం విజయశాంతి నేతృత్వంలో రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేయనున్నారు.