అమరావతి, మార్చ్ 5: ఆంధ్రప్రదేశ్ లో రేపు, ఎల్లుండి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎండ తీవ్రతతో పాటు భారీ వడగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. దీనిపై వాతావరణ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ...ఏపీలో ఈ రోజు పగటి ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే 23 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా రేపు రాయలసీమలో వడగాలులు వీస్తాయని ఆయన హెచ్చరించారు. ఎల్లుండి అంటే గురువారం ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుందని తెలిపారు.