కరీంగనర్, మార్చ్ 2: నేడు కరీంనగర్ లో జరిగిన డెయిరీ పాల ఉత్పత్తిదారుల సదస్సులో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..కరీంనగర్ డెయిరీని కాపాడిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. రైతులు, ప్రజలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందని రాజకీయ నేతలకు సోయి ఉండాలన్నారు. కరీంనగర్ డెయిరీని మూసివేసేందుకు సమైక్య పాలకులు కుట్రలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప డెయిరీ కరీంనగర్లోనే ఉందన్నారు. రైతులకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. అదేవిధంగా 75 శాతం సబ్సిడీతో లబ్దిదారులకు గేదెలను ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ తుల ఉమ తదితరులు హాజరయ్యారు.