పూర్తి వాల్తేరు రైల్వే జోన్ డివిజన్ కొరకు దీక్ష

SMTV Desk 2019-03-01 18:22:47  Railway Zone, Vishakha, Valtheru, Chalasani Srinivas, Protest

అమరావతి, మార్చి 1: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయం పట్ల టీడీపీ నేతలు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ లో కొంత భాగం మాత్రమే ఉండేట్టుగా ఈ రైల్వేజోన్ ఏర్పాటు కానుండటంపై అసంతృప్తి చెందారు.

ఈ క్రమంలో ప్రత్యేక హోదా సమితి నేత చలసాని శ్రీనివాస్ దీక్షకు దిగారు. విశాఖపట్టణంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 48 గంటల దీక్షను చేపట్టారు. విశాఖకు మోదీ రానుండటాన్ని, పూర్తి స్థాయి రైల్వేజోన్ రాకపోవడాన్ని నిరసిస్తూ ఈ దీక్షకు దిగారు. కేకే లైనుతో కూడిన విశాఖ రైల్వేజోన్ ప్రకటించాలని చలసాని డిమాండ్ చేస్తున్నారు.