ప్రేమికుడిని కొట్టి ఆపై యువతి పై అత్యాచారం

SMTV Desk 2019-02-28 13:29:45  west godavari, west godavari crime, ap crime

పశ్చిమ గోదావరి, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెంలో ఈనెల 24న గుర్తుతెలియని దుండగులు ఓ యువతిపై అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి యత్నించిన యువతి స్నేహితుడు నవీన్ పై దుండగులు తీవ్రంగా దాడిచేశారు.

దీంతో ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు 4 రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. రాజు అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల సమాచారం. స్థానికంగా ఉండే ఓ తోటలో పనిచేస్తున్న రాజు గతంలో చాలామంది మహిళలపై లైంగికదాడి చేసాడన్న ఆరోపణలు ఉన్నాయి.

నిందితుడిని ప్రస్తుతం అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. యువతిపై రాజు అత్యాచారం చేయబోగా ఆమె స్నేహితుడు నవీన్ అడ్డుకున్నాడనీ, దీంతో నవీన్ పై రాజు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడని పేర్కొన్నారు. అనంతరం యువతిపై లైంగికదాడి చేసి కిరాతకంగా హత్య చేసినట్లు ఆధారాలు లభ్యమైయ్యాయి.

ఈ నెల 24న ఆదివారం కావడంతో యువతీయువకులు జీలకర్రగూడెంలోని బౌద్ధారామాల సందర్శనకు వచ్చారని తెలిపారు. మరికాసేపట్లో నిందితుడు రాజును పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.