నంద్యాల, ఆగష్టు 3: నంద్యాలలో జరుగుతున్న వైసీపీ బహిరంగ సభలో శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ... తాను ఎమ్మెల్సీ పదవిలోకి వచ్చి 90రోజులు పూర్తి కాలేదు. కానీ జగన్ అడిగిన విధంగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆయన నైతిక విలువలు కాపాడానని స్పష్టం చేశారు. దమ్ముంటే వైసీపీ నుంచి పదవి అనుభవిస్తున్న వాళ్లు పదవులకు రాజీనామా చేసి గెలిచి చూపించాలి అని సవాల్ చేశారు. తాజాగా "భూమా డ్రామా" అనే కొత్త సినిమా విడుదలైంది. తల్లిదండ్రుల ఫోటో పలకలు తగిలించుకుని ఓట్లు అడుక్కోవడానికి వస్తున్నారన్నారు. వాళ్లు ఎన్ని రకాలుగా ప్రజలను ఆకట్టుకున్నా చివరికి ఓట్లు వైసీపీకే అని, అన్ని మతాలు, కులాల ఓట్లు తమకే అన్నారు. జనమే మా సోదరులకు దేవుళ్లని, ఓట్లు ఎవరికి వేయాలో ఆలోచించగల సామర్థ్యం ప్రజలకు ఉందని చక్రపాణి రెడ్డి హెద్దెవ చేశారు. ఈ ఉపఎన్నికల్లో దుమ్ము దులపాల్సిందే, ఇక శిల్పా సోదరుల ఆట మొదలైందని ఆయన అన్నారు.