96.14% మంది తుది రాత పరీక్షకు హాజరు

SMTV Desk 2019-02-25 12:38:20  Police Exam, SI, Andhrapradesh, 96.14

అమరావతి, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం నిర్వహించిన పోలీసుశాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు తుది రాత పరీక్షకు 96.14% మంది అభ్యర్థులు హాజరైనట్లు బోర్డు చైర్మన్‌ కుమార్‌ విశ్వజీత్‌ తెలిపారు. ప్రాథమిక ప్రవేశ పరీక్ష, దేహ దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన 32,755 మంది అభ్యర్థులకు శని, ఆదివారాల్లో విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూల్‌ కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. కాగా ఈ పరిక్షకు 1,266మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 25న ఆన్సర్‌ కీ, తుది ఫలితాలు రెండు వారాల్లో విడుదల(ఓఎంఆర్‌ షీట్‌ స్కాన్‌) చేస్తామని చెప్పారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 28లోగా రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు మెయిల్‌ చేయవచ్చని సూచించారు. కాగా, పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో 334 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్‌ 1న ఏపీ పోలీసుశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.