అమరావతి, ఫిబ్రవరి 05: తిరుపతిలో ఈరోజు పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. దీనికి ఆరు రాష్ట్రాల నుండి పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, చత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై పార్లమెంట్ ఎన్నికల భద్రతా విషయంపై చర్చలు జరిపినట్లుగా సమాచారం. దీంతో పాటు మావోయిస్టుల కదలికలు, పోలీస్ సిబ్బంది తరలింపుపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిజిపి ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, హెలికాప్టర్, ఎయిర్ అంబులెన్స్ లు, ఎర్రచందనం అక్రమ రవాణ, సరిహద్దు రాష్టాలలో ఉన్న సమస్యలు తదితర అంశాలపై చర్చించామని ఆయన తెలిపారు.
ఇక పప్రమోషన్ల విషయం పై మాట్లాడుతూ హైకోర్టు నిర్దేశం ప్రకారమే ప్రమోషన్ల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమోషన్లపై జ్యుడీషియల్ స్క్రూటినీ ఉంటుందని, ఈసీ నుంచి రాత పూర్వకంగా వస్తే రిప్లే ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు.