అమరావతి, ఫిబ్రవరి 5: గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో ఇటీవల ప్రారంభించిన జనసేన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. మద్యం సీసాలతో కార్యాలయం అద్దాలను ద్వంసం చేసారు. దాంతోపాటు పార్టీ కార్యాలయ సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేసి పరారయ్యారు. ఘటనపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీ చర్యే అని, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని జనసేన వర్గాలు మండి పడ్డాయి.