అమరావతి, జనవరి 30: వచ్చే నెల 8వ తేదీతో ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ క్రమంలో బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫిబ్రవరి వొకటిన విభజన సమస్యలు, ప్రత్యేక హోదా అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు. కాగా 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 5వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 6వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు చర్చ సాగుతుంది. 7వ తేదీన సంక్షేమం, ఇతర శాఖలపై చర్చిస్తారు. ఎనిమిదవ తేదీన విజన్ డాక్యుమెంట్పై చర్చిస్తారు. దాంతో సమావేశాలు ముగుస్తాయి.